Sri Tallapaka Annamacharya (1408-1503) the saint composer of the 15th century is the earliest known musician of India to compose 32k songs called “sankIrtanas” in praise of Lord Venkateswara.Lord Vishnu manifested Himself as Lord Venkateswara in Tirumala Hills to protect the Dharma from decay in the Current Age (Kali Yuga). Annamacharya was born as the incarnation of Hari Nandakam(sword)
to promote Dharma through his powerful Sankirtanas (devotional songs).
Tuned by Sri Ganti Shashank, sung by Sri Ganti Shashank, Smt Ganti Padmaja , in ragam: malayamarutam Video link ఉప్పవడము గావయ్యా ఉయ్యాలమంచముమీఁద గొప్పగొప్ప కన్నుల గోవిందరాజా =పల్లవి=
పవ్వళించే వీడ వచ్చి పాయనినీయలపెల్ల మువ్వంక మే నితోడ ముచ్చట దీఱ నవ్వేటి శ్రీ సతి చూపు నాటిన చిత్తపుమేన క్రువ్వనికలువదండై గోవిందరాజా =ఉప్ప= నిద్దరించే వీడ వచ్చి నిలుచున్నయలపెల్ల ప్రొద్దువొద్దునకుఁ దీర భోగీంద్రుపై యిద్దరు సతులు నీకు నేచిన తాళగతుల గుద్దేటి పాదములతో గోవిందరాజా =ఉప్ప= మెండుగ మేలుకొంటివి మించిన కౌఁగిటిలోన కొండుకపాయపుసిరి కోపించంగా ఉండవయ్యా సుఖలీల నుడివోనిప్రియముతో కొండలకోనేటిరాయ గోవిందరాజా =ఉప్ప=
తేనెలూరే అన్నమాచార్య కీర్తనను ఆస్వాదించండి. ఈ పొడవునకు పొడవైన పురుషోత్తముడు సృష్టికంతటికీ ఈశ్వరుడు. ప్రతి ప్రాణిలోనూ తానే ఆత్మ రూపంలో వ్యవహరిస్తుంటాడు. ఆయన భక్తులైన మనందరికోసం ఎన్నో అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి మనందరినీ అలరించాడు. నేడు ఈ మహానుభావుడే తిరువెంకటనాథుడై జగములను పరిపాలిస్తున్నాడు. మనందరి బరువు తానే భరిస్తూ భారకుడని పేరు పొందాడు.
ఈతడే అఖిలంబునకు ( సమస్తమునకు ) ఈశ్వరుడై ( అధినాథుడై ) వ్యవహరించుచున్నాడు. సకల భూతములలోనూ ( సర్వ ప్రాణులలో ) తానే ఆత్మరూపములో పొదలువాడు ( వర్ధిల్లువాడు ).
జవ్వనులైన గోపకన్నెల మెరుగు ఘన స్తనములపైన కనుపించు కమ్మని కస్తూరిపూత ఇతడే. అలాగని ఈయన కేవలం విలాస పురుషుడా? కానేకాదు. ఉత్తమోత్తములైన తాపసుల చింతాసౌధములలో ( భావనా భవంతులలో ) వెలుగుతున్న సుజ్ఞానమనే దీపము ఈ యోగీశ్వరుడే సుమా!
జలధికన్య ( క్షీరసాగర తనయ అయిన శ్రీమహాలక్ష్మి ) అపాంగ లలితేక్షణములలో ( అందమైన కడగంటి చూపులలో ) ఉన్న వెలుగులు విరజిమ్ము కజ్జలంబు ( కాటుక ) ఈతడే ( ఈ రమాకాంతుడే ). జలజాసనుని ( బ్రహ్మదేవుని ) ముఖములనే సంద్రముల మధ్య వెలసి అలరుచున్న పరమజ్ఞానామృతము ఈతడే.
పరిమితులు లేని సంభోగసమాగమములో వధూవరులకు వైభవము నింపుతూ పరవశత్వము కలిగించునది ఎవరనుకున్నారు? ఈ జగన్నాథుడే. ఇదుగో నేడు తిరుమల శిఖరాలపై శ్రీవేంకటేశ్వరుడై తానేయుండి పరిపాలనము చేయుచున్న భారకుడు ( అందరి భారమును వహించేవాడు ) ఈ దేవదేవుడే.